ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ ప్రణీతకు పదవి దక్కడం సంతోషంగా ఉందని కొత్తపల్లి(H) సర్పంచ్ చౌహన్ డిగంబర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు శ్యాంసుందర్ ఉన్నారు.