VSP: భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతి సభను ఈ నెల 29న అల్లిపురం సీపీఐ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు నాస్తిక సమాజం నేతలు తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు జరిగే సభలో పలువురు వక్తలు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన సమావేశంలో గోడపత్రికలు ఆవిష్కరించారు. ప్రజలు, ప్రగతిశీల వాదులు పెద్దఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.