అన్నమయ్య: రాయచోటిలోని శ్రీ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.