ATP: విడపనకల్లు మండలం పాల్తూరులో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పలువురు రైతుల గడ్డివాములు మంటల్లో చిక్కుకోగా, విషయం తెలిసిన వెంటనే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలు ఆర్పేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి చొరవతో భారీ ఆస్తి నష్టం తప్పింది.