TPT: ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తేదీ సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాల తయారీ ప్రారంభమైంది. సుమారు 1.60 లక్షల ప్యాకెట్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల నుంచి వచ్చిన 600 మంది శ్రీవారి సేవకులు ఇందులో పాల్గొంటున్నారు.