అన్నమయ్య: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఈ విషయం తెలిసి జరుగుతుందో లేదో తెలియదని, కానీ త్రిసభ్య కమిటీ నివేదిక రాకముందే ఎమ్మెల్యే శ్రీధర్ను పార్టీ కార్యక్రమాల్లో అనుమతిస్తున్నారని బాధితురాలు హర్షవీణ ఆరోపించారు. ఇది పవన్ కళ్యాణ్కు తెలియకుండా జరుగుతుందా అనే సందేహాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.