విజయనగరం స్థానిక గూడ్స్ షెడ్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో శ్రీ సీతారామ కల్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ఈవో వెంకటరమణ. ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి స్వామి వారికి దేవస్థానం తరుఫున పట్టువస్త్రాలు సమర్పించి కల్యాణ మహోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని తిలకించారు.