SRD: జిన్నారం మున్సిపాలిటీ జంగంపేట గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా ఇవాళ తొలిసారి సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాల మధ్య అర్చకులు కళ్యాణ క్రతువు జరిపారు. అనంతరం అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఆశాదేవి, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.