శ్రీకాకుళం నగరం రామలక్ష్మణ కూడలి వద్ద శ్రీ సత్యసాయి సేవా సమితి బ్యాంకర్స్ కాలనీ వారి సౌజన్యంతో నూతన చలివేంద్రం శుక్రవారం ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సేవా స్ఫూర్తితో జిల్లాలో 100 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.