విశాఖపట్నం అల్లిపురం 33వ వార్డులో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్రంలో మళ్లీ రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు. అలాగే, శ్రీరాముడి పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారని పేర్కొన్నారు.