KNR: సైదాపూర్ మండలంలోని సైదాపూర్-మొలంగూర్ ప్రధాన రహదారిపై సోమారం శివారులో ప్రమాదకరమైన గుంత ఏర్పడింది. రోడ్డు మధ్యలో ఉన్న ఈ గుంత వాహనం సమీపానికి వెళ్లే వరకు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం మరింత నరకప్రాయంగా మారిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతను పూడ్చాలని కోరుతున్నారు.