NLR: ముత్తుకూరు మండల కేంద్రంలో మంచి నీటి చలివేంద్రాన్ని సర్వేపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త సురేశ్ నాయుడు శుక్రవారం ప్రారంభించారు. వేసవి తాపంతో ప్రజలు అల్లాడిపోతూ గుక్కెడు మంచినీళ్లు కావాలంటే కొనుక్కొని తాగే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రయాణికులకు నీటి అవసరం ఎంతో ఉంటుందని, అందుకోసమే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.