GNTR: గుంటూరు నగరంలోని 56వ డివిజన్, మోతీలాల్ లైన్ పరిధిలో రైల్వే స్థలాల్లో నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లను ప్రభుత్వం తొలగించాలనే చర్యలపై ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తక్షణమే స్పందించారు. ఆమె స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు.