KMM: సత్తుపల్లి పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన స్వామివారి కల్యాణాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ విజయకుమార్, మున్సిపల్ ఛైర్మన్ రెహనా బేగం, ఆర్యవైశ్య సంఘం పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.