BDK: భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సదుపాయాలను పటిష్ఠం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ దుర్గాభవాని శుక్రవారం 108 అంబులెన్స్ను పరిశీలించారు. అంబులెన్స్లో ఉన్న అత్యవసర వైద్య పరికరాలు, ఆక్సిజన్ సదుపాయం, ప్రథమ చికిత్స సామగ్రి వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు.