AP: గత పాలకులు రాష్ట్రంలోని లిఫ్టుల మెయింటనెన్స్ పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో 1008 లిఫ్టుల్లో 355 అస్సలు పనిచేయడం లేదని తెలిపారు. 489 పాక్షికంగా, 158 లిఫ్టులు వందశాతం పనిచేస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో లిఫ్టులతో 8 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. లిఫ్టులు పనిచేయకపోవడంతో సగానికి సాగు పడిపోయిందన్నారు.