JN: జాఫర్ ఘడ్ మండలంలోని తమ్మడపల్లెలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని భక్తులు ఆకాంక్షించారు.