మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయంలో బలిపీఠం మహోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీనివాస చారి బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ఈ క్రతువు జరిగింది. ఈ వేడుకను కళ్లారా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.