ప్రకాశం: మర్రిపూడి మండలం నరసాపురంలో శ్రీరామనవమి సందర్భంగా గ్రామంలో నేడు విద్యుత్ ప్రభను ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. కోదండ రామస్వామి తిరుణాల సందర్భంగా ప్రభను ఏర్పాటు చేయనున్నారు. సమీప గ్రామాల నుంచి ప్రజలు గమనించాలని నిర్వాహకులు తెలిపారు. ప్రభపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.