PPM: గుమ్మలక్ష్మీపురం రెసిడెన్షియల్ బాలికల పాఠశాలకు చెందిన ప్రణీత ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్-2026 అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల ఝార్ఖండ్లో జరిగిన జాతీయస్థాయి 200 మీటర్ల పరుగు పోటీలలో టాప్-8లో నిలిచినట్లు కోచ్ శ్రీనివాసరావు తెలిపారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు చత్తీస్గఢ్లో జరిగే పోటీలలో ఆమె పాల్గొననుంది.