ATP: విద్యా హక్కు చట్టం మేరకు ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్యకు జిల్లాలో 1712 మంది విద్యార్థులు ఎంపికయ్యారని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపిక జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చే నెల 4 తేదీలోగా ఆయా పాఠశాలలకు వెళ్లి తమ ప్రవేశాలు నిర్ధారించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం మొదటి విడత మాత్రమే చేశామన్నారు.