కడప: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మొదలవుతుందని అన్నారు. ఈ మేరకు జిల్లాలోని కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు విధిగా హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.