అన్నమయ్య: జిల్లాలో వృత్తి విద్యపై జిల్లా స్థాయి ఓరియెంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. డైట్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో 39 పీఎం శ్రీ పాఠశాలలు, 35 జిల్లా పరిషత్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వొకేషనల్ ఇన్స్పెక్టర్లు కలిపి సుమారు 200 మంది పాల్గొన్నారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ అసదుల్లా జాతీయ విద్యా విధానం 2020 ప్రాముఖ్యతను వివరించారు.