NRPT: ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ సర్వేలో జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించేలా పని చేయాలని డీఈవో గోవిందరాజు అన్నారు. నారాయణపేటలో ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు నిర్వహించిన రెండు రోజుల ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. శిక్షణపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని చెప్పారు. సర్వేకు అన్ని యాజమాన్య పాఠశాలలు సిద్ధంగా ఉండాలని తెలిపారు.