KKD: అన్నవరం సత్యదేవుని హుండీ ఆదాయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.19.55 కోట్లు సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 13 సార్లు హుండీలను తెరచి లెక్కించారు. గతేడాది జూన్, నవంబరు, డిసెంబరు మాసాల్లో అత్యధిక ఆదాయం వచ్చింది. రోజు సరాసరి హుండీల ద్వారా రూ.5.35 లక్షలు ఆదాయం సమకూరిందని ఛైర్మన్ రోహిత్, ఈవో త్రినాధరావు తెలిపారు.