SS: హిందూపురం పట్టణంలో పోలీసులు గురువారం రాత్రి నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిఘా నిర్వహించారు. డీఎస్పీ మహేష్ నేతృత్వంలో అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ మద్యపానం, అనుమానాస్పద వ్యక్తుల సంచారంపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. తిలక్ నగర్, మోడల్ కాలనీ వంటి ప్రధాన ప్రాంతాల్లో సీఐ జనార్ధన్ ఆధునిక సాంకేతికతతో తనిఖీలు చేశారు.