WGL: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదన్నపేట రోడ్డు వెడల్పు పనులకు ఎమ్మెల్యే మాధవరెడ్డి చొరవతో మార్గం సుగమమైంది. మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ పనులను పరిశీలించి, త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. వర్షాకాలంలో రవాణా ఇబ్బందులు లేకుండా, బురద, గుంతల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి అన్నారు.