HNK: ఐనవోలు మండలం పంతిని గ్రామంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మామునూరు ఏసీపీ తిరుపతి పాల్గొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని ఆయన సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని తెలిపారు.