ADB: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ. 10 వేల కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని PDSU జిల్లా సహాయ కార్యదర్శి కనకే దత్తాత్రి కోరారు. గురువారం పట్టణంలో సంఘం నాయకులతో సమావేశమై మాట్లాడారు. నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ కళాశాలలో చదివి విద్యార్థులు సర్టిఫికెట్లు అందక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.