వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్య క్రమం నేటి నుంచి యధావిధిగా నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతులను సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.