MDK: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్ద శంకరంపేట తహసీల్దార్ ప్రభుదాస్, ఎస్సై ప్రవీణ్ రెడ్డి పేర్కొన్నారు. పెద్ద శంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే వాహనాలను సీజ్ చేయడం, కేసు కూడా నమోదు చేస్తామన్నారు.