VKB: జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, అంగన్వాడీ, పంచాయతీ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పెండింగ్ పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా 100 శాతం పనులు పూర్తయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.