కృష్ణా: గన్నవరంలో KDCC బ్యాంక్ ఆధ్వర్యంలో రైతులు, డ్వాక్రా మహిళలు, గృహ రుణాల కోసం రూ.25 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం ముఖ్య అతిథులుగా పాల్గొని లబ్ధిదారులకు గురువారం చెక్కులు అందజేశారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి సహకార వ్యవస్థ బలోపేతం చేస్తున్నామని రఘురాం తెలిపారు.