విక్రాంత్ మాస్సే, రాశి ఖన్నా జంటగా నటించిన ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రం 2024లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ, మేకర్స్ ఈ చిత్రానికి సీక్వెల్ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘ది టెర్రర్ రిపోర్ట్’ పేరుతో ఈ సీక్వెల్ను రూపొందించబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సీక్వెల్కు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నాడు.