KMR: ట్విన్స్ డే రోజే ట్విన్స్ వివాహం చేసుకున్న అరుదైన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో జరిగింది. ఘన్పూర్కు చెందిన భాస్కర్- సుజాత దంపతుల కవల కుమారులు విజయ్కుమార్, వినయ్కుమార్కు తాడ్వాయి మండలం దేమే గ్రామానికి చెందిన కుమ్మరి రాజమణి- సాయన్న కవల కుమార్తెలు కీర్తన, కీర్తితో వివాహం జరిగింది. అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజే వారికి పెళ్లి అయింది.