కృష్ణా: నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి ఈరోజు పర్యటించారు. ఈ క్రమంలో వ్యవసాయ మిషన్ మాజీ ఛైర్మన్ నాగిరెడ్డిని కలిసి ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాతృవియోగం కుటుంబానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. మనోధర్యంతో ఉండాలని నాగిరెడ్డికి సూచించారు.