KKD: దేశ ఆర్థిక పురోగతికి ‘దివాళా చట్ట సవరణ బిల్లు-2025’ ఎంతగానో దోహదం చేస్తుందని, దేశ ప్రయోజనాల దృశ్యా కేంద్రం ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం లోక్ సభలో కేంద్రం ప్రవేశ పెట్టిన దివాళా చట్ట సవరణ బిల్లు-2025 పై ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడారు.