AKP: కోటవురట్ల మండలం అణుకు గిరిజన గ్రామంలో జల్ జీవన్ మిషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గ్రామంలో నివసిస్తున్న 30 గిరిజన కుటుంబాలకు ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేసేందుకు 30 వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ నిర్మిస్తున్నారు. మంచినీటి బోరు వేసి నెల రోజుల్లో తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు RWS ఏఈ శ్రీనివాస్ గురువారం తెలిపారు.