TPT: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు సీతారాముల కల్యాణం, 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు విందు భోజనం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.