VSP: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ పరిధిలోని మాంసం దుకాణాలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. నగరంలో మాంసం, చేపలు, రొయ్యల అమ్మకాలు నిషేధించినట్లు ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్ తెలిపారు. ఆదేశాలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.