NLR: దడదర్తి మండలం కాట్రాయపాడులో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎస్సై జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి గురువారం దాడులు చేశారు. నిల్వ చేసిన టపాసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.