MLG: కోయగూడా పంచాయతీ పరిధిలోని రాంనగర్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తానని సర్పంచ్ పోరిక సరిత అన్నారు. రాంనగర్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన టాయిలెట్స్ను సర్పంచ్ ప్రారంభించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు.