NGKL: సలేశ్వరం జాతరకు వెళ్లే భక్తులు అటవీ నిబంధనలు పాటించాలని లింగాల ఎస్సై వెంకటేష్ గౌడ్ సూచించారు. లింగాల నుంచి అప్పాయిపల్లి వరకు బస్సులు, అక్కడి నుంచి గిరిజగుండం వరకు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భక్తులు వెంట తాగునీరు తీసుకెళ్లాలని, అడవిలో చెత్త వేయకూడదని కోరారు.