టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల భూ వివాదంలో చిక్కుకున్నాడు. వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ భూమి కొనుగోలు విషయంలో కొందరు వ్యక్తులు తనను మోసం చేశారని ఆయన CCS పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేరే వ్యక్తులకు చెందిన భూమిని తనకు అమ్మారని, ఇందుకోసం గతంలో రూ.కోటి చెల్లించానని పేర్కొన్నాడు. ఇటీవల కోర్టు తీర్పుతో ఈ విషయం వెలుగులోకి రాగా, ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.7 కోట్లు ఉంటుందని అంచనా.