BHPL: రేగొండ (M) లింగాల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దొంగల రవీందర్ (49) ఇవాళ తన భార్య, కుమారుడితో కలిసి పొలాలకు వెళ్లాడు. ఇల్లు నిర్మాణానికి తీసుకున్న అప్పుల కారణంగా మానసిక ఒత్తిడికి గురై అసహజంగా ప్రవర్తించి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. SI ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.