ఏలూరు: జిల్లా వ్యాప్తంగా పెట్రోలు అందుబాటులో ఉందని ఎటువంటి కొరత లేదని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని సూచించారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి నిల్వలు తీసుకోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కువ నిల్వలో ఉంటే 9550351100కు సమాచారం ఇవ్వాలన్నారు.