సత్యసాయి: ధర్మవరం నియోజకవర్గంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేయాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరంను కలిసి ఈ మేరకు విన్నవించారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ పాఠశాల అవసరమని మంత్రి సత్యకుమార్ వివరించారు.