కోనసీమ: రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో బుధవారం సీతారాముల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ కోదండరామ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ఉదయం 9.45 గంటలకు మృగశిర నక్షత్ర యుక్త వృషభ లగ్న మందు విగ్రహాలను ప్రతిష్టించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు.