NLR: నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని పేదల ఇళ్లను అక్రమంగా తొలగించడంపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నగర అభివృద్ధి పేరుతో అర్ధరాత్రి వేళల్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సామాన్యుల ఇళ్లను కూల్చివేయడం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి ముసుగులో పేదల పొట్ట కొట్టడం తగదని, బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు