GNTR: రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని హాస్టళ్లలో మౌలిక సదుపాయాల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు.